రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ లడ్డూ వేలం రికార్డ్ సృష్టించింది. రూ.18లక్షల 90 వేలకు  మర్రి శశాంక్ రెడ్డితో కలిసి కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ లడ్డూను దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30 వేలు అధికంగా పలికింది. 2019లో కొలను రామిరెడ్డి17 లక్షల 60వేలకు దక్కించుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం వేయలేదు. లడ్డూ వేలంలో   25 మంది పాల్గొన్నారు.  రూ.1,116 నుంచి మొదలైన లడ్డూ వేలం పాట రూ.18.90 లక్షల  దగ్గర ముగిసింది. లడ్డూను మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఇద్దరు కలిపి వేలంలో దక్కించుకున్నారు.  దాదాపు 27 సంవత్సరాలుగా లడ్డూ వేలం జరుగుతోంది. 1994లో మొదటి సారిగా కొలను మోహన్ రెడ్డి రూ.450 కి దక్కించుకున్నారు.