వనస్థలిపురంలో వివాహిత ఆత్మహత్య

వనస్థలిపురంలో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ వనస్థలిపురం సుష్మసాయి నగర్ లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. సైదాబాద్ కు చెందిన నివేదిత సుష్మ సాయినగర్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ రఘు ప్రసాద్ కి 8 నెలల కిందట వివాహం జరిగింది. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని బంధువులంటున్నారు. అత్తింటి వేధింపులతోనే నివేదిత ఆత్మహత్య చేసుకొందని తండ్రి ఆరోపించాడు. దాంతో.. భర్త రఘు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.