లైంగిక వేధింపులతో వివాహిత సూసైడ్​

లైంగిక వేధింపులతో వివాహిత సూసైడ్​

వర్ధన్నపేట, వెలుగు:  వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో  మంగళవారం  లైంగిక వేధిపులతో  ఓ యువతి  సూసైడ్​ చేసుకుంది. వర్ధన్నపేట ఎస్​ఐ ప్రవీణ్ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు సాయినగర్​కాలనీకి  చెందిన మంజుల (34),   శ్రీను  భార్యాభర్తలు.   వీరు10 సంవత్సరాలుగా ముంబయిలో  చెట్ల మందు  వైద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2 నెలల కింద  ముంబయి నుంచి వారి సొంతూరు తొర్రూరుకు ఇల్లు కట్టుకోడానికి వచ్చి వారి తండ్రి ఇంట్లో ఉంటున్నారు.   పై పోర్షన్​లో తొర్రూరు మండలం వెలికట్ట టిక్యాతండా కు చెందిన జాటోతు జితేందర్ రెంట్​కు ​ఉంటున్నాడు.  ఈక్రమంలో  మంజులను జితేందర్​ లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టాడు.

ALSO READ :సిటీలో ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటరింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 

ఈ బెదిరింపులకు తాళలేక 15 రోజుల కింద తన భర్త శ్రీనుకు జితేందర్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలుపడంతో   తొర్రూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జితేందర్​కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.  అయినా బుద్ధి మారకపోవడంతో గ్రామపెద్దలకు తెలుపడంతో వారు మందలించారు.  మళ్లీ మంజులకు ఫోన్​చేసి వేధించాడు.  దీంతో ఆమె మానసికంగా కుంగిపోవడంతో మంజుల చెల్లె ఊరైన తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి పంపించారు.  అక్కడికి వెళ్లినా ఫోన్​ చేసి వేధించాడు. దీంతో    జితేందర్​తో  మాట్లాడుదామని  ఇల్లంద గ్రామంలో  రెంట్​కు ఉంటున్న ఇల్లు దగ్గరకు  మంజుల  ఈనెల 23న రాత్రి వెళ్లింది.  ఎలాగైన తన కోరిక తీర్చాలని అతడు వేధించడంతో  ఆమె అక్కడే ఉన్న ఎలుకల మందు తాగింది. 

దీంతో ఆమెను జితేందర్​ ఎంజీఎం తీసుకెళ్లాడు.  అక్కడే తొర్రూరుకు చెందిన కొందరు చూసి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు.  వారంతా అక్కడికి చేరుకుని చూసేసరికి  మంజుల చనిపోయి ఉంది .  తన భార్య చావుకు కారణమైన జితేందర్​పై  చర్యలు తీసుకోవాలని శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.