న్యూఢిల్లీ: మారుతి సుజుకీ తమ కస్టమర్లకు తక్కువ ఈఎంఐలతో లోన్ అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో టై అప్ అయ్యింది. దీనిలో భాగంగా కొత్తగా మారుతీ కార్లు కొనే వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో–ఈఎంఐని ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం మారుతి కస్టమర్లు ప్రతి ఏడాది మూడు నెలల పాటు లో –ఈఎంఐని చెల్లిస్తే సరిపోతుంది. దీంతోపాటు కస్టమర్లు ప్రతి రూ. లక్ష అప్పుపై కేవలం రూ. 899 లను ఈఎంఐగా చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్ను మొదటి ఆరు నెలల వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందిస్తుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్లి పేరుతో యువకుడికి వల.. రూ.65 లక్షలు నొక్కేసి..

