
మారుతి బుధవారం జిమ్నీ మోడల్లో కొత్త వెర్షన్లు లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఆఫ్ రోడ్ డ్రైవింగ్కు కూడా ఈ కారు బాగా సరిపోతుందని కంపెనీ పేర్కొంది. గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిల్లీమీటర్లు ఉందని తెలిపింది. ఆటోమెటిక్ వెర్షన్ లీటర్కు 16.94 కి.మీ, ఐదు గేర్లుండే మాన్యువల్ కారు లీటర్కు 16.39
కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.