భార్య,తమ్ముడికే ఆస్తి రాసిన మారుతీరావు

భార్య,తమ్ముడికే ఆస్తి రాసిన మారుతీరావు

మిర్యాలగూడలో పరువు హత్యకు పాల్పడి…రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ(మంగళవారం) కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణ జరుగనుండగా, చార్జ్ షీట్ కు అదనంగా ఈ వీలునామా పత్రాల కాపీలను పోలీసులు జత చేయనున్నారు.

మారుతీరావు కొంతకాలం క్రితమే వీలునామాను మార్చి రాశారు. తన ఆస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరుతో…మిగతా మొత్తాన్ని భార్య గిరిజ పేరుతో రాసిన ఆయన..దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరుతో మారుతీ రావు ఒక్క పైసా కూడా రాయలేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తర్వాత … తన ఆస్తిలో అధిక భాగాన్నిఆయన కుమార్తె పేరిటే రాశారు. అయితే అమృత ఇక తన దగ్గరకు రాదని అనుకున్న మారుతీరావు లేటెస్టుగా వీలునామాను మార్చి రాశారు.

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు చనిపోవడంతో … అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.