
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2024, జూలై 2వ తేదీ మంగళవారం కోల్కతాలో ధాపాలోని షైరాబాద్లోని ఇంజన్ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిప్రమాదక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఘటనాస్థలం పరిసర ప్రాంతం చుట్టూ దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం, ఎవరికి గాయాలు గాని కాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.