
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. గురువారం ( జూన్ 5 ) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీలు వెంకటరావుపల్లి నుంచి ముస్తాపురంకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకొని ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలిలో మండలం రాచపాళెం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. టెంపో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన 14 విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. రాచపాళెం హైవే దగ్గరికి రాగానే టెంపో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.