
భద్రాచలం,వెలుగు : చత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లా దిబ్రిపారా గ్రామానికి చెందిన అమర్సింగ్కుమేటీ ఇంట్లోకి సోమవారం రాత్రి మావోయిస్టులు వెళ్లి బైక్ను తగులబెట్టారు. ప్రాణాలతో ఉండాలంటే కుటుంబంతో గ్రామం వదిలి వెళ్లిపోవాలని అమర్సింగ్ని హెచ్చరించారు. అయితే మావోయిస్టులు వచ్చిన సమయంలో అతనుఇంట్లో లేరు. కాగా ఇంటి వద్ద నార్త్ సబ్జోనల్బ్యూరో పేరుతో మావోయిస్టులు కరపత్రాలను వదిలి వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.