బైక్​ తగులబెట్టిన మావోయిస్టులు

బైక్​ తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గఢ్​లోని నారాయణ్​పూర్ జిల్లా దిబ్రిపారా గ్రామానికి చెందిన అమర్​సింగ్​కుమేటీ ఇంట్లోకి సోమవారం రాత్రి మావోయిస్టులు వెళ్లి బైక్​ను తగులబెట్టారు. ప్రాణాలతో ఉండాలంటే కుటుంబంతో గ్రామం వదిలి వెళ్లిపోవాలని అమర్​సింగ్​ని హెచ్చరించారు. అయితే మావోయిస్టులు వచ్చిన సమయంలో అతను​ఇంట్లో లేరు. కాగా ఇంటి వద్ద నార్త్ సబ్​జోనల్​బ్యూరో పేరుతో మావోయిస్టులు కరపత్రాలను వదిలి వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.