బంజారా భవన్​ పనులు కంప్లీట్​ చేయాలి : మయాంక్  మిత్తల్

బంజారా భవన్​ పనులు కంప్లీట్​ చేయాలి  : మయాంక్  మిత్తల్

నారాయణపేట, వెలుగు: బంజారా భవన్  నిర్మాణ పనులు, తండాలకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్  మయాంక్  మిత్తల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో బంజారా భవన్, ఇతర పనులపై రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా భవన్  పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. మద్దూరు, కోస్గి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. టెండర్, అగ్రిమెంట్  త్వరగా కంప్లీట్​ చేసి పనులు ప్రారంభించాలన్నారు.