రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైలు ప్రయాణం చేస్తున్నారా..? రోటీన్ ఫుడ్ తో బోరు కొడుతోందా? మీకు ఇష్టమైన ఆహారం లభించడం లేదా.. పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీలు ఫుడ్స్ దొరకడం లేదా.. డోంట్ వర్రీ ఇకపై రైల్వే స్టేషన్లలో రకరకాల దేశ విదేశాలకు చెందిన బ్రాండెడ్ ఫుడ్ కంపెనీల వెరైటీస్ లభించనున్నాయి. మన ఇండియన్ రైల్వే స్టేషన్లలో..ఎప్పుటినుంచి ఏయే బ్రాండెడ్ కంపెనీల ఫుడ్స్ లభిస్తాయో ఓ సారి లుక్కేద్దాం పదండి..
భారతీయ రైల్వే సంస్థ ఫుడ్ రెవెల్యూషన్ తీసుకురాబోతోంది.. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్లేషన్లలో రకరకాల ఆహార పదార్థాలను అందించనుంది. ఇందులో భాగంగా ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ అవుట్ లెట్స్ ను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తుంది. మన దేశ బెస్ట్ బ్రాండ్ ఫుడ్స్ మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ఫుడ్ బ్రాండ్ల ఫుడ్ స్టాల్స్ ను ప్రతి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనుంది.
మెక్ డోనాల్డ్, KFC, పిజ్జా హట్ , హల్దీరామ్స్,బికనేర్ వాలా, బాస్కిన్స్ రాబిన్స్ వంటి ప్రముఖ ప్రపంచ, భారతీయ ఫుడ్ బ్రాండ్ల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తోంది.
ఈ స్టాల్స్ ఏర్పాటు అయితే రైల్లే ప్రయాణికులు తమ ఇష్టమైన బర్గర్లు, పిజ్జాలు, స్నాక్స్ను ప్లాట్ ఫాం పైనే కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని విమానాల్లో అందిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, ఫ్రెష్ ఫుడ్ అందించే లక్ష్యంలో ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ స్టాల్స్ ను కంపెనీలు గానీ, ఫ్రాంచైజ్ పార్టినర్స్ ద్వారాగానీ ఈ వేలం ద్వారా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.
