గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రాధాన్యం  :   కలెక్టర్ప్రతిమాసింగ్

గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రాధాన్యం  :   కలెక్టర్ప్రతిమాసింగ్
  • సేఫ్​ మదర్​డేలో మెదక్​ కలెక్టర్​ప్రతిమాసింగ్​

మెదక్​ టౌన్​, వెలుగు: గర్భిణులు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మెదక్​ కలెక్టర్​ప్రతిమాసింగ్​ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సేఫ్ మదర్‌‌‌‌‌‌‌‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ హెల్తీగా ఉంటారని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు.

డీఎంహెచ్‌‌‌‌వో శ్రీరామ్​, డీసీహెచ్‌‌‌‌ఎస్​ శివదయాల్, అడిషనల్​కలెక్టర్ నగేశ్‌‌‌‌, డీఎంఏ సునీత, డీడబ్ల్యూవో హేమభార్గవి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.  మెదక్ జిల్లాలో ఇండ్ల గణనను పక్కాగా చేయాలని కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అధికారులను ఆదేశించారు. బుధవారం జనగణన అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణలో భాగంగా ఇళ్ల గణన బ్లాకులు తయారు చేయాలన్నారు.