గీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మా దేవేందర్ రెడ్డి

గీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం  ఇస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీ ఘనపూర్​ మండల పరిధిలోని రాజిపేట శివారులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం  గ్రామ శివారులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈత మొక్కలను నాటారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవించేవారిని గత పాలకులు విస్మరించారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాతే వారి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్నారు.   గీత కార్మికులకు పింఛన్ మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు.  స్వచ్ఛమైన కల్లును అందించడానికి ఈత వనాలను పెంచుతున్నామని పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో మెదక్​ జడ్పీ వైస్​చైర్​పర్సన్​లావణ్య, రాజిపేట సర్పంచ్  సరిత సాయాగౌడ్, ఎంపీటీసీలు స్వప్న  దుర్గా రావు, జ్యోతి సిద్ధిరెడ్డి,  వాడి సర్పంచ్ యామి రెడ్డి, నాయకులు భిక్షపతి రెడ్డి, పాండురంగారావు, బాబాగౌడ్, నారాగౌడ్, గౌడ సంఘం నాయకులు  తదితరులు పాల్గొన్నారు.