హైకమాండ్ ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీ చేస్త : రఘునందన్ రావు

హైకమాండ్ ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీ చేస్త : రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే.. మెదక్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గతంలో కూడా మెదక్ ఎంపీగా పోటీ చేసిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలకు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టనుందన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు పంచుతుంటే సిద్దిపేట పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు జిల్లా మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారని, సంబంధిత పోలీసు అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.