కరోనాతో మేడారం సమ్మక్క పూజారి కన్నుమూత

కరోనాతో మేడారం సమ్మక్క పూజారి కన్నుమూత

ములుగు: మేడారం సమ్మక్క దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న సిద్దబోయిన సమ్మారావు (28) కరోనా బారిన పడి మృతి చెందారు. సమ్మారావుకు నెల క్రితం కరోనా సోకింది. అయితే వైరస్ నుంచి కోలుకున్నాక తిరిగి ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సమ్మారావు తుదిశ్వాస విడిచారు. ఈనెల 11నే సమ్మారావు భార్య సృజన కూడా కరోనాతో మృతి చెందింది. వీరికి ఓ బాబు, ఒక పాప ఉన్నారు. తల్లిదండ్రులిద్దరి మరణంతో పిల్లలు అనాధలయ్యారు.