కొనసాగుతున్న మేడారం హుండీ లెక్కింపు

కొనసాగుతున్న మేడారం హుండీ లెక్కింపు

మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర హుండిల లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు ఇవాళ(బుధవారం) ప్రారంభించారు.హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం లో పోలీస్ సిబ్బంది బందోబస్తుతో లెక్కింపు నిర్వహిస్తున్నారు.మూడువందల మంది సిబ్బందితో.. 497 హుండీలను వారం రోజుల పాటు లెక్కించనున్నట్లు దేవాదాయశాఖ ఈవో రాజేంద్రం తెలిపారు. పలు దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ‌ల‌ వారు లెక్కింపులో పాల్గొన్నారన్నారు.

ఉదయం 8నుండి సాయంత్రం 6వరకు హుండీ లెక్కింపు ఉంటుందన్నారు ఈవో. గత మేడారం జాతరకు 11కోట్లు వచ్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు వెన్నెముక‌