
మేడ్చల్, వెలుగు: ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమించాలని మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సులో స్వీకరించిన అప్లికేషన్లను వెంనటే ఆన్లైన్ చేయాలన్నారు. అర్జీలను నిర్దేశిత కోడ్లలో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.