ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకోండి: అడిషనల్​ క‌లెక్టర్ విజ‌యేంద‌ర్ రెడ్డి

ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకోండి: అడిషనల్​ క‌లెక్టర్  విజ‌యేంద‌ర్ రెడ్డి

మేడ్చల్, వెలుగు: ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమించాలని మేడ్చల్ మల్కాజ్​గిరి అడిషనల్​ క‌లెక్టర్ (రెవెన్యూ) విజ‌యేంద‌ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మండ‌లంలోని సోమారం గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భార‌తి  రెవెన్యూ స‌ద‌స్సును ఆయన ప‌రిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. స‌ద‌స్సులో స్వీక‌రించిన అప్లికేషన్లను వెంనటే ఆన్‌లైన్  చేయాల‌న్నారు. అర్జీల‌ను నిర్దేశిత కోడ్​లలో న‌మోదు చేయాల‌ని సూచించారు. ప్రతీ దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.