కేరళలో కొత్త రకం కరోనా .. జేఎన్.1 వేరియంట్​ తొలి మరణం

కేరళలో కొత్త రకం కరోనా .. జేఎన్.1 వేరియంట్​ తొలి మరణం

పథనంతిట్ట: కేరళలో కరోనా కొత్త రకం వేరియంట్ జేఎన్.1 కేసును వైద్యాధికారులు గుర్తించారు. శనివారమే ఈ కేసును గుర్తించగా.. ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు చనిపోయాడు. అయితే, జేఎన్.1 వేరియంట్​విషయంలో ఆందోళన అక్కర్లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్  చెప్పారు.

రాష్ట్రంలో హెల్త్ సిస్టమ్ పటిష్ఠంగా ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు. జేఎన్.1 అనేది సబ్ వేరియంట్ మాత్రమేనని, సింగపూర్ ఎయిర్ పోర్ట్​లో జరిపిన పరీక్షల్లో ఈ వేరియంట్​బయటపడిందని వివరించారు. అక్కడున్న మన పౌరులలో దీనిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారన్నారు.