ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం: మీనాక్షి నటరాజన్

ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం: మీనాక్షి నటరాజన్

ఓట్ చోరీతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ ప్రధాని మోదీ , ఎన్నికల కమిషన్​ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.. హర్యానా, మహారాష్ట్ర లో ఓట్​ చోరీ జరిగిందని ప్రూఫ్​ లతో నిరూపించిన క్రమంలో ఎన్డీయే ఓట్​ చోరీపై  కాంగ్రెస్​ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుందని కాంగ్రెస్​ తెలంగాణ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ చెప్పారు. త్వరలో ఓట్​ చోరీపై తెలంగాణలో ప్రజల దగ్గర వెళ్తామని చెప్పారు. 

ఓట్​ చోరీపై రాహుల్​ గాంధీ అనే విషయాలు బయటపెట్టారన్నారు మీనాక్షి నటరాజన్​. ఓట్​ చోరీపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందన్నారామె. ఓట్​ చోరీపై ఢిల్లీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 
తెలంగాణ పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. కర్ణాటకలో ఓటర్​ జాబితాలో అవకతవకలు బయటపెట్టారు రాహుల్​ గాంధీ.  ఓట్ల చోరీతోనే హర్యానాలో కాంగ్రెస్​ పార్టీ ఓడిపోయిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించారని చెప్పారు.