మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’( Padma Vibhushan)అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించడంతో దేశ నలుమూలలా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవల(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించింది.
లేటెస్ట్గా అమెరికా లాస్ ఏంజిల్స్లో తెలుగు సినీ అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్ను ( Mega Felicitation Event) ఆదివారం(ఫిబ్రవరి 19న) లాస్ ఏంజిల్స్లో గ్రాండ్గా నిర్వహించారు.
ఈ ఈవెంట్లో ‘పద్మ విభూషణ్’ అవార్డు గ్రహీత చిరంజీవికి పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాగా ప్రపంచ దేశాలలో ఇంతమంది తెలుగు అభిమానులు తనపై ప్రేమ చూపడం సంతోషం..ఇక్కడ మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్లో తనను సత్కరించిన మెగా ఫ్యాన్స్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు.
ఎంతో గుర్తింపు ఇచ్చిన పద్మ విభూషణ్ అవార్డు రావడం సంతోషమే..కానీ, మీరు చూపించే ప్రేమ, అభిమానం అంతకుమించిన ఆనందాన్ని ఇస్తుందని చిరు ఈ ఈవెంట్లో అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి తన 157 విశ్వంభర ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ షూట్ను ఈమధ్యనే మొదలుపెట్టారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ను ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
Mega Felicitation to Padma Vibhushan Dr. Megastar #Chiranjeevi garu
— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 19, 2024
at Los Angeles By USA Mega Fans
Boss @KChiruTweets#MegastarChiranjeevi#PadmaVibhushanChiranjeevi pic.twitter.com/NNDlvbU2b1