
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : టీజీ స్టెప్ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 23న 10 గంటలకు గౌలికర్ నర్సింగ్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మంగళవారం జాబ్ మేళా పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సుమారు 60కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. 5 వేల నుంచి 8వేలకుపైగా వివిధ కేటగిరిల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఏదైనా కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర విద్యార్హతలు ఉన్నవారు
లేని వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంతరావు సూచించారు. ఐటీఐ, డిప్లొమా, హోటల్ మేనేజ్ మెంట్ , బీఫార్మ , ఎమ్ ఫార్మా, ఇంజనీరింగ్, ఎంబీఏ అర్హులైన 18 – 35 ఏండ్ల యువతి, యువకులు హాజరుకావొచ్చని పేర్కొన్నారు. బయో డేటా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని రావాలని సూచించారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కె. సంతోష్ కుమార్, నేతలు కె. రాఘవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.