తంగళ్లపల్లి, వెలుగు: కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు మోకు జారడంతో చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కృష్ణయ్య(59) 35 ఏండ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఊర్లోనే ఉంటూ కల్లు గీస్తున్నాడు. రోజూలాగే బుధవారం ఉదయం కల్లుకు వెళ్లిన కృష్ణయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి తాటి వనంలో వెతికారు. తాటి చెట్టుపై చనిపోయి కిందికి వేలాడుతూ కనిపించాడు. మోకు జారి చాతికి బిగుసుకోవడంతో మృతి చెందాడని గ్రామస్తులు చెప్పారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. జిల్లెళ్ల ఎంపీటీసీ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు.
కల్లు గీస్తూ గీత కార్మికుని మృతి
- తెలంగాణం
- December 16, 2021
లేటెస్ట్
- నిర్లక్ష్యం వేలాడుతోంది
- అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్
- విమెన్స్ టీ20 వరల్డ్ కప్..ఒకే గ్రూప్లో ఇండియా, ఆసీస్
- రెండో విడత ర్యాండమైజేషన్ .. ఈవీఎంల కేటాయింపు కంప్లీట్
- బజ్రంగ్పై సస్పెన్షన్ వేటు
- కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం
- రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ మినీ షెడ్యూల్
- పింక్ ట్యాక్స్ అంటే ఏమిటి?
- వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు
- ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?