మెట్రో స్టేషన్ మెట్ల పైనుంచి జారి పడి ఒకరి మృతి

మెట్రో స్టేషన్ మెట్ల పైనుంచి జారి పడి ఒకరి మృతి

పద్మారావునగర్, వెలుగు: మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి జారి పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన గాంధీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్ మెట్రోస్టేషన్ మెట్ల పైనుంచి కిందపడి ఓ వ్యక్తి(50)తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని పక్కనే ఉన్న గాంధీ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవని, కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.