డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. 

ఈ డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం డీజీపీకి సాయి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సాయి కోరారు.