మెక్సికో క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి

మెక్సికో క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి

మెక్సికో ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా నగరంలో డిసెంబర్ 17 ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా డజను పైగా మంది గాయపడ్డారు.  దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు.  దాడికి సంబంధించిన పరిస్థితుల గురించి  సమాచారం అందలేదని  స్టేట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. 

 స్థానిక మీడియా ప్రకారం సాల్వాటియెర్రాలోని  బాధితులు క్రిస్మస్ పార్టీ తరువాత  ఈవెంట్ హాల్ నుండి బయలుదేరినప్పుడు కాల్పులు జరిగినట్లుగా వెల్లడించింది.  గ్వానాజువాటో జాలిస్కో కార్టెల్, సినాలోవా కార్టెల్ మద్దతు ఉన్న స్థానిక ముఠాల మధ్య నిరంతరం దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3 వేల029 మెక్సికోలో అత్యధిక హత్యలు జరిగిన రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానం ఉంది.