
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపు యోగాసానం విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ప్రతి ఒక్కరు యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలని యోగా గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాడు.
ఈ సారి గుండు సూదిపై ఒంటికాలుతో నిలుచొని నటరాజు, బ్యాలెన్సింగ్ యోగాసనం వేస్తున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి రూపొందించాడు. ఈ విగ్రహం తయారీకి గుండు పిన్ను. ( మైనము పెన్సిల్ కలర్స్ ) వాడనని, విగ్రహ తయారీకి 10 గంటల సమయం పట్టినట్లు దయాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ యోగ డే శుభాకాంక్షలు తెలియజేసారు.
జూన్ 21న అంతర్జాతీయా యోగా దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..యోగా అలవాడు చేసుకుని శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి యోగా ఉపయోగపడుతోంది. మానసకి ప్రశాంతత లభిస్తుందని..ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు.