రైతులకు గుడ్ న్యూస్.. మిడ్ మానేరుకు జలకళ.. కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ లకు ఫుల్ వాటర్

రైతులకు గుడ్ న్యూస్.. మిడ్ మానేరుకు జలకళ.. కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ లకు  ఫుల్ వాటర్

మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్  మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గాయత్రి పంప్ హౌస్ కు, అక్కడి నుంచి వరద కాల్వ ద్వారా మిడ్  మానేరుకు నీళ్లు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్  పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.819 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

గాయత్రి పంప్  హౌస్  నుంచి 15,850 క్యూసెక్కుల నీటిని మిడ్  మానేరుకు పంపింగ్  చేస్తున్నారు. మిడ్  మానేరులో నీరు చేరడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయలాంటి మిడ్  మానేరు ప్రాజెక్ట్  నుంచే కరీంనగర్  లోయర్  మానేరు డ్యామ్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీళ్లు సరఫరా చేయనున్నారు.  -