మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12మంది స్పాట్ డెడ్

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12మంది స్పాట్ డెడ్

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వైజాపూర్ ప్రాంతంలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేపై  వేగంగా దూసుకొచ్చిన  ఓ  ప్రైవేటు మినీ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను  ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

 ఈ ఘటన  2023 అక్టోబర్ 15వ తేదీ ఆదివారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 35 ప్రయాణికులు ఉన్నారని.. మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులున, ఆరుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.