ప్రతి మండలానికో మినీ స్టేడియం ఏర్పాటు : విప్ ఆది శ్రీనివాస్

ప్రతి మండలానికో మినీ స్టేడియం ఏర్పాటు : విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి, వెలుగు: ప్రతి మండలానికి ఓ మినీ స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు విప్​ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడు క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారం ఉంటుందన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య

వేములవాడ, వెలుగు: పేద విద్యార్థులకు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బడి బాటలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌, బుక్స్‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో విద్యరంగం వెనకబడిందన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.200కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రొండి రాజు, ఎంఈవో బన్నాజీ, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, రాకేశ్‌‌‌‌‌‌‌‌, గూడురి మధు, రాజు, పులి రాంబాబు పాల్గొన్నారు.