ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం : ధనసరి అనసూయ 

ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం : ధనసరి అనసూయ 
  •     మంత్రి ధనసరి అనసూయ 

ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గ అబివృద్ధికి అధికారులు, లీడర్లు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సూచించారు.  మండలంలోని ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్​, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాలతో కలిసి మంత్రి నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అడవుల వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలుంటాయో  అటవీ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.   గిరిజనులకు ఐటీడీఏలో అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు.

కొత్త ఐటీడీఏ భవనం కోసం ప్రపోజల్స్​ సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..   నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.10కోట్ల నిధులను కేటాయించినట్టు తెలిపారు.  ఎస్పీ శబరీష్​ మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం చేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉందని, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డీఎఫ్​వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్​ కలెక్టర్లు శ్రీజ, మహబూబాబాద్ అడిషనల్​ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఏటూరు నాగారం అడిషనల్​ ఎస్పీ సిరిశేట్టి సంకీర్త్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, డీఆర్ డీఓ శ్రీనివాస్ కుమార్​ పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్​ : మంత్రి 

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతుందని, అర్హులైన ప్రతీ ఇంటికి గృహజ్యోతి పథకం అమలు అవుతుందని  మంత్రి   సీతక్క  స్పష్టం చేశారు. బుధవారం ములుగులోని సుభాష్​ నగర్​, సఫాయివాడలో  లబ్ధిదారులకు జీరో బిల్ అందించారు.   గత ప్రభుత్వం  ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చుర్, డీఈ  నాగేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.