
- మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి: మంత్రి శ్రీధర్ బాబు
- రూ. 2.90 కోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాల అందజేత
మంథని, వెలుగు : మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ను మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని మండలం గుంజ పడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ లో రూ. 2.90 కోట్ల నిధులతో పీఏం కుసుమ్ కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కే. రవీందర్ రావుతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కుసుమ్ పథకాన్ని రైతులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అనుకూలంగా ఉండేలా రాష్ట్రంలోనే మొదటిసారిగా మన జిల్లాలో 4 చోట్ల సోలార్ ప్రాజెక్టులు మంజూరు చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓ సురేశ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, లీడర్లు అయిలి ప్రసాద్, కాచే శేషి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.