హైదరాబాద్ కు రావడం వెనుకున్న ఆంతర్యం ఏంటీ..?

హైదరాబాద్ కు రావడం వెనుకున్న ఆంతర్యం ఏంటీ..?

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న హైదరాబాద్లో మతఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే అస్సాం ముఖ్యమంత్రి వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. అస్సాంలో జరుగుతున్న నిమజ్జనం వేడుకలలో పాల్గొనకుండా హైదరాబాద్ రావడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ సారథ్యంలో 8ఏళ్ల నుండి ఎలాంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతుందని.. ఈ సారి అస్సాం సీఎం రాక వల్ల ఉద్రిక్తత చోటుచేసుకుందన్నారు.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. వరంగల్ ఎంతో చారిత్రాత్మకమైనదని.. సాహిత్య, సాంస్కృతిక నగరమని చెప్పారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్న ఆయన.. వినాయక నిమజ్జనం వైభవంగా జరుగుతోందన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.