రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా జైలుకు పోయినోళ్లే: ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా  జైలుకు పోయినోళ్లే: ఎర్రబెల్లి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. తెలంగాణలో రెండు పిచ్చికుక్కలు తిరుగుతున్నాయంటూ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వీళ్లను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్ళంతా.. భూ కబ్జాలు, బ్లాక్ మెయిలింగులు చేసి గతంలో జైలుకు వెళ్ళివచ్చినవారే అని ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ రూ.500 కోట్లతో ఇళ్ళు ఎలా కట్టాడో చెప్పాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.