హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. అది భూస్థాపితం అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్లో నిన్న రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి తెలంగాణను అవమానించారని చెప్పారు. దీన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకు ప్రస్తుతం శవయాత్ర జరుగుతోందన్నారు. రేవంత్ బీజేపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఏ మాత్రం బాగుపడలేదని ఎర్రబెల్లి విమర్శించారు.
రేవంత్ రెడ్డితోనే తెలంగాణలో టీడీపీ ఖతమైందని ఎర్రబెల్లి అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తామంతా తెలంగాణ కోసం కొట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు ఏజెంట్లా పని చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్లో రేవంత్కు ఎవరూ విలువ ఇవ్వడంలేదని, అలాంటప్పుడు బయటి వారు ఎలా ఇస్తారని.. తెలంగాణ కోసం ఆయన ఏం చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగు నీటి కటకట ఎదుర్కొన్న తెలంగాణలో ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.