ఇంకా సీరియస్ గానే ప్రీతి ఆరోగ్యం: ఎర్రబెల్లి

ఇంకా సీరియస్ గానే ప్రీతి ఆరోగ్యం: ఎర్రబెల్లి

సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని, నిందితుడిపై చర్యలు తీసుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఇప్పటికే అరెస్ట్ చేసి, జైలుకు కూడా పంపించామన్నారు. గతంలో ప్రీతి తల్లిదడ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే మాట కొంతవరకు వాస్తవమే అని చెప్పారు. ఈ విషయంలో మాత్రం నిందితుడికి శిక్ష తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ఆరోగ్యంపైనే దృష్టి సారించిందని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. సైఫ్ చాటింగ్ చేసిన మెసేజ్ లన్నీ దొరికాయన్నారు. బీజేపీ కామెంట్స్ సరైనవిగా ఉండవని కొట్టిపారేశారు. ప్రీతి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అన్నారు. ప్రీతి కుటుంబానికి అందరూ అండగా ఉండాలని, లేనిపోనివి సృష్టించవద్దని కోరారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉందన్నారు. అయితే..ఆమెకు ఎటువంటి జబ్బులు లేవని, కోలుకుంటోందని ఆశిస్తున్నామని చెప్పారు.