ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి

 ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి

హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా  రెండేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు సరిగ్గా నిర్వహించలేదని తెలిపారు. వేయి స్తంభాల గుడిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారుమయంగా మారుతుందని మంత్రి అన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్న మంత్రి... రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.