కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : హరీశ్​​రావు

కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : హరీశ్​​రావు

 గజ్వేల్​, వెలుగు: నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి సీఎం కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్​లోని ఆయన నివాసంలో వర్గల్​ మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు బీఆర్​ఎస్​ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​కు భారీ మెజార్టీ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అనంతగిరిపల్లి పార్టీ ప్రెసిడెంట్​ తుమ్మల నర్సింలు, ఉప సర్పంచ్ కనకరాజుయాదవ్​, నాయకులు కిషన్​, ఆగేశ్​, రవి, నగేశ్​, దారజాని ఉన్నారు.