సీపీఆర్ చేసి బతికించిన ఏసీపీ.. హరీశ్ అభినందనలు

సీపీఆర్ చేసి బతికించిన ఏసీపీ.. హరీశ్ అభినందనలు

హైదరాబాద్ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గుండె పోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిండు. అనంతరం అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

సమయానికి  స్పందించి వ్యక్తి ప్రాణాలు నిలిపిన ట్రాఫిక్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు అభినందించారు. CPR నేర్చుకుని జీవితాలను రక్షించాలని సూచించారు.