
పోడు భూముల సమస్యలపై త్వరలో మంత్రి మీటింగ్
సంగారెడ్డి టౌన్, వెలుగు: పోడుభూముల సమస్యలపై త్వరలోనే మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్తెలిపారు. సోమవారం క్యాంపు ఆఫీస్లో పోడు భూముల సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన రివ్యూ చేశారు. అంతకు ముందు జిల్లాలో ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ గురించి డీఆర్డీవో, స్పెషల్ఆఫీసర్లతో నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. 3 రోజుల్లోగా ‘ఆసరా’ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు , డీపీవో సురేశ్మోహన్ పాల్గొన్నారు.
‘తిగుల్’ కేంద్రంగా మండలం చేయాల్సిందే
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: తిగుల్ గ్రామం కేంద్రంగా మండలం ప్రకటించాల్సిందేనని తిగుల్ మండల సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. వారు చేస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి యాభై రోజులకు చేరడంతో ప్రజ్ఞాపూర్ -–భువనగిరి రోడ్డుపై ధర్నా, వంటావార్పు చేసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్మేర వెహికల్స్నిలిచిపోవడంతో మర్కూక్ ఎస్సై శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకొని నిరసన విరమించాలని కోరారు. ఆందోళన కారులు వినకపోవడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. మండలం సాధించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు స్పష్టం చేశారు. మండల సాధన సమితి సభ్యులు ఐలయ్య, మహేందర్ రెడ్డి, జంగని ఐలయ్య, ఈశ్వర్, అశోక్ , గ్రామస్తులు
పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కృషి చేస్తా... ఎమ్మెల్యే రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: మండలంలో పద్మశాలి గడ్డ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు తెలిపారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో పద్మశాలి గడ్డ ప్రజలు తనకు వెన్నుదన్నుగా నిలిచారని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. అనంతరం గ్రామంలో పారుపల్లి సత్తయ్య కుటుంబ సభ్యుడు చనిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బొప్పాపూర్ గ్రామానికి చెందిన పర్వతనేని దేవేందర్రావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీజేపీ లీడర్లు సుభాశ్ రెడ్డి, మాధవనేని భాను తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సమ్మేళనానికి ఎంపికైన ఎర్రవల్లి
జగదేవ్పూర్ (కొమురవెల్లి), వెలుగు : అభివృద్ధిలో ముందున్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22 నుంచి 24 వరకు మహారాష్ట్రలోని పూణెలోని జాతీయ స్థాయిలో జరగనున్న పంచాయతీ రాజ్ సమ్మేళనానికి రాష్ట్రం నుంచి ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యలక్ష్మికి ఆహ్వానం అందింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ లో సర్పంచ్ పాల్గొననున్నట్లు చెప్పారు.
మోడీ జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్
రామాయంపేట, వెలుగు: ప్రధాని మోడీ బర్త్డే వారోత్సవాల్లో భాగంగా రామాయంపేట పట్టణంలో సోమవారం ఆయన జీవిత చరిత్ర పై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మంజీర ఐటీఐలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ప్రారంభించారు. ఇందులో మోడీ బాల్యం నుంచి పీఎం అయ్యే వరకు ఎదిగిన క్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. వీటిని పట్టణంలో ఆయా స్కూళ్ల స్టూడెంట్లు తిలకించారు. పార్టీ స్టేట్ లీడర్ నందు జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకుడు సుధాకర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చ ప్రెసిడెంట్ బెండ వీణ తదితరులు పాల్గొన్నారు.
చెరువులో పడి యువకుడి మృతి
దుబ్బాక, వెలుగు: మండలంలోని గంభీర్పూర్లో చెరువులో పడి ఓ యువకుడు చనిపోయాడు. దుబ్బాక పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దోర్నాల శ్రీకాంత్(23) సమోసాల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. సమోసాల కోసం శుక్రవారం ఇంటినుంచి బయలుదేరి సిద్దిపేటకు వెళ్లాడు. గ్రామ చెరువులో చేపలవేటకెళ్లిన మత్స్య కారులకు చెరువులో డెడ్బాడీ కనిపించింది. గ్రామస్తుల సాయంతో బయటకు తీయగా శ్రీకాంత్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్షాక్తో యువరైతు మృతి
సిద్దిపేట రూరల్, (చిన్నకోడూరు) వెలుగు: చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో విద్యుత్షాక్తో యువరైతు చనిపోయాడు. స్థానికులు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదుల్ల మునీందర్ రెడ్డి(35) తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. సోమవారం రాత్రి పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లగా పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలకు స్ప్రింక్లర్ తగలడంతో షాక్ తగిలి స్పాట్లోనే చనిపోయాడు.
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
కంది, వెలుగు : సంగారెడ్డి టౌన్లో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు సోమవారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ రమేశ్ కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన వడ్డె నవీన్(23) మల్కాపూర్ చింతల్లో ఉంటూ, ఓ ప్రైవేట్కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా తండ్రి పోచయ్య ‘ జీతం డబ్బులు ఇంట్లో ఇస్తలేవ్.. జల్సాలు చేస్తున్నావా?’ అని మందలించడంతో మనస్తాపం చెందిన నవీన్మహబూబ్సాగర్చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పోచయ్య కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అత్తింటి వేధింపులు భరించలేక యువతి..
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : హత్నూర మండలం.. సిరిపుర గ్రామంలో అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రుక్మొద్దీన్కు నేరడిగుంట గ్రామానికి చెందిన సల్మాబేగం(23) తో ఏడాదిన్నర కింద వివాహం జరిగింది. సల్మా బేగం తండ్రి మదార్సాబ్తన ఇద్దరు పెద్ద కూతుళ్లకు ఇటీవల చెరో 20 గుంటల భూమి ఇచ్చాడు. చిన్న కూతురైన సల్మాబేగం కు ఇవ్వకపోవడంతో ఆమె అత్తింటివారు భూమి తెచ్చుకోవాలని, పిల్లలు కలుగడం లేదని వేధించారు. మనస్తాపం చెంది, ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది
బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి
కంగ్టి/నారాయణఖేడ్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం పైసలతోనే జరుగుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమదేవి అన్నారు. సోమవారం మండలం పరిధిలోని దామర్ గిద్ద, జమ్గి(కే), జమ్గి(బీ),ఘన్ పూర్, తడ్కల్ చాప్టా(కే) తదితర గ్రామాల్లో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలు విజయపాల్ రెడ్డి, సంగప్ప తో కలిసి రుద్రమదేవి మాట్లాడుతూ.. ప్రజలకు అందాల్సిన కేంద్రం పైసలు కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంటోందని ఆరోపించారు. అధికార టీఆర్ఎస్పార్టీని వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలని సంగప్ప ప్రజలకు పిలుపునిచ్చారు. లిక్కర్ స్కాం లో సీఎం ఫ్యామిలీ పాత్రపై కేంద్రం ఫోకస్చేసిందని, త్వరలోనే ఆ ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయమని విజయపాల్రెడ్డి అన్నారు.
తడ్కల్ మండలం బీజేపీతోనే సాధ్యం
తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని .. మండల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలు చేస్తుంటే అధికార పార్టీ లీడర్లు దొంగచాటున దీక్షా శిబిరాల టెంట్లను తీసేశారని, బీజేపీ అధికారంలోకి రాగానే మండలం ఏర్పాటు చేస్తామని రాణి రుద్రమదేవి హామీ ఇచ్చారు.
మోటార్లకు మీటర్లు తప్పుడు ప్రచారం..
కేంద్రం మోటార్లకు మీటర్లు పెడ్తారనడం తప్పుడు ప్రచారం అని రాణీ రుద్రమ అన్నారు. ఖేడ్ లో ఆమె ప్రెస్మీట్లో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఫామ్హౌస్సీఎంను పారదోలుదామని పిలుపునిచ్చారు.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి హాజరై ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ అర్జీలను స్పీడ్గా పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కాగా భూసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు సంబంధించి 65 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ టౌన్, వెలుగు : ప్రజావాణికి భూసమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నందున వాటి పరిష్కారానికి ఫస్ట్ప్రయారిటీ ఇవ్వాలని మెదక్ అడిషనల్కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరై అడిషనల్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ సమస్యలకు సంబంధించి 62 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు మెదక్, నర్సాపూర్ఆర్డీవోలతో కో ఆర్డినేషన్ చేసుకోవాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరామ్ పాల్గొన్నారు.
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి హాజరై ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ అర్జీలను స్పీడ్గా పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కాగా భూసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు సంబంధించి 65 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ టౌన్, వెలుగు : ప్రజావాణికి భూసమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నందున వాటి పరిష్కారానికి ఫస్ట్ప్రయారిటీ ఇవ్వాలని మెదక్ అడిషనల్కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరై అడిషనల్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ సమస్యలకు సంబంధించి 62 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు మెదక్, నర్సాపూర్ఆర్డీవోలతో కో ఆర్డినేషన్ చేసుకోవాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరామ్ పాల్గొన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసి అవార్డులను గెలుచుకోవాలి
పంచాయతీరాజ్ డిఫ్యూటీ కమిషనర్ జాన్వెస్లీ
తూప్రాన్, వెలుగు: గ్రామ పంచాయతీలను బాగా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు గెలుచుకోవాలని స్టేట్ పంచాయతీరాజ్ డిఫ్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ సూచించారు. సోమవారం ఆయన తూప్రాన్ మండలం మల్కాపూర్ లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులు సాధించేందుకు గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై సర్పంచ్, వార్డు సభ్యులకు సూచనలు చేశారు. డీపీవో తరుణ్ కుమార్, సర్పంచ్ మహదేవి, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ వెంకటమ్మ తదితరులున్నారు.
గ్రామాల్లో తిరగలేకపోతున్నం
దుబ్బాక, వెలుగు: ‘క్రీడా మైదానానికి, శ్మశాన వాటికకు జాగా దొరకదు.. సీసీ రోడ్లుండవు.. కనీసం డ్రైనేజీ వ్యవస్థ ఉండదు.. దీంతో గ్రామాల్లో తిరగాలంటే ముఖం లేకుండా పోతుంది’ అని దుబ్బాక మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ కొత్త పుష్పలత అధ్యక్షతన సోమవారం జరిగిన దుబ్బాక సర్వ సభ్య సమావేశంలో పలువురు సభ్యులు అధికారులకు సమస్యలు ఏకరువు పెట్టారు. బై ఎలక్షన్టైంలో లచ్చపేట మోడల్స్కూల్ను ఎలక్షన్ ఆఫీసర్లు వాడుకున్నారని, స్కూల్లో కరెంట్వైర్లు, టాయిలెట్లు పాడు చేయడంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని చీకోడు ఎంపీటీసీ రాంరెడ్డి వాపోయారు. చీకోడు శివారులోని 1134 సర్వే నంబర్లో 17. 27 ఎకరాల ప్రభుత్వ భూమిని రామక్కపేట మాజీ సర్పంచ్ఆక్రమించినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని సర్పంచ్ శ్రీనివాస్ ఆరోపించారు. ఇలా మండలంలోని పలు సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీడీవో భాస్కర శర్మ, తహసీల్దార్ సలీమ్మియా పాల్గొన్నారు.
ఎంపీటీసీలకు నిధులివ్వండి
కోహెడ, వెలుగు: ఎంపీటీసీలకు ఫండ్స్ఇవ్వకపోవడంతో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని, వెంటనే నిధులు ఇవ్వాలని కోహెడ ఎంపీటీసీ ఖమ్మం స్వరూప ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశంతో కలసి ఎంపీడీవో ఆఫీస్లో సూపరింటెండెంట్రాఘవేంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పరిధిలో 3 గ్రామాలు, 4 ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు చూస్తున్నా.. ఫండ్స్లేకపోవడంతో.. ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు జగన్, శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఘనంగా జీఎంఆర్ బర్త్డే
సంగారెడ్డి, వెలుగు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బర్త్ డే వేడుకలు తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఇంద్రానగర్లో టీఆర్ఎస్నేత ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆహ్వానించిన ఇంద్రారెడ్డి ఆయనతో కేక్ కట్చేయించి సన్మానించారు. కార్పొరేటర్ పుష్ప నగేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ లలిత సోమిరెడ్డి, కౌన్సిలర్లు సీఎన్ బాలాజీ, శ్రీశైలం, టీఆర్ఎస్మున్సిపల్ప్రెసిడెంట్దేవేందర్ యాదవ్, సాగర్ పాల్గొన్నారు.