తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు: మంత్రి హరీష్ రావు

తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు: మంత్రి హరీష్ రావు

తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామన్నామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి 8 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 

దేశం మొత్తం సీట్లు 2,220 మెడికల్ సీట్లు ఉంటే.. 900 సీట్లు ఒక్క తెలంగాణ లో ఉన్నాయన్నారు. 43 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కొత్త కాలేజీలకు ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. పల్లె, బస్తీ దవాఖానాల్లోనూ నియామకాలు చేపట్టామని, తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలతో అదనపు సీట్లు వస్తాయని చెప్పారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు.