
సిద్దిపేట జిల్లా : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. మంగళవారం ఆయన గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందన్నారు. సోమవారం కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు.
ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అమోఘమని కొనియాడారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు అవగాహన కల్పిస్తూ., ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉండాలని, మాస్కులు ధరించాలన్నారు. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరిస్తూ.., ఇలాగే అందరం ఐక్యతతో కరోనా వైరస్ ను తరిమికొడదామని తెలిపారు. ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం , 1500 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు మంత్రి హరీష్ రావు.