ప్రజాతీర్పును గౌరవిస్తాం : హరీశ్​రావు

ప్రజాతీర్పును గౌరవిస్తాం : హరీశ్​రావు

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్​పార్టీకి అభినందనలు తెలిపారు. రెండు సార్లు బీఆర్ఎస్​కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్​ను ఆదరించారని, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పాలన సాగాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని.. దీన్ని విశ్లేషించుకొని ముందుకు సాగుతామన్నారు.