
- డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క
మాదాపూర్, వెలుగు : యువత చెడు వ్యసనాలను వీడి ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని రాష్ర్ట ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డ్రగ్స్ కు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్ శిల్పకళావేదికలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ర్టంలో డ్రగ్స్ నియంత్రణ, అక్రమ రవాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది డ్రగ్ పెడ్లర్లతో పాటు వినియోగదారులపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని భావి తరాలకు స్పూర్తిదాయకంగా నిలవాలని మంత్రి సీతక్క సూచించారు. మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడినా
వినియోగించినా కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్నివారణపై నార్కోటిక్ బ్యూరో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీ హీరో సుమన్, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, తేజ సజ్జా, నార్కోటిక్ బ్యూరో, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.