
కామారెడ్డి, వెలుగు : చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు ఎలా అవుతారని, దయ్యాల నాయకుడు కూడా దయ్యమే కదా.. అని రాష్ర్ట ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్స్ఫంక్షన్ హాల్లో కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్జరిగింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్తో బుద్ధి చెప్పకుండా అమెరికా ఆదేశించిందని కేంద్రం యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేసి, ప్రపంచ దేశాల ముందు ప్రధాని మోదీ మన దేశ పరువు తీశారని విమర్శించారు. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్నేతలు లక్ష్యం పెట్టుకోవాలన్నారు. గొడవలు, వివాదాలకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఆరోపించారు.