హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమ విస్తరణకు అవసరమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని సూచించారు. టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధిపై సోమవారం బేగంపేట క్యాంపు ఆఫీస్లో ఆయన సమీక్షిం చారు. ఏడాదిన్నరగా టెక్స్టైల్ రంగంలో నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమా లు చేపట్టిందని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. టెక్స్టైల్ రంగం నుంచి బడ్జెట్లో చేర్చాల్సిన కార్యక్రమాలపైనా పలు సూచనలు చేశారు.