కూకట్పల్లిలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న

కూకట్పల్లిలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న

తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ కి ప్రియారిటీ ఇస్తుందన్నారు. యాక్ టెక్ సంస్థ ఏర్పాటు చేసిన ఎక్స్ పోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ హబ్ గా ఉందన్నారు.  ఇన్నోవేషన్ రంగంలో  తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

అటు  కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రూ.28.51 కోట్ల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసి ఫ్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మ్మెల్సీ నవీన్ కుమార్,  టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.