సిరిసిల్ల జిల్లా: అనారోగ్యంతో మరణించిన సిరిసిల్లా జిల్లా రాచర్ల బొప్పాపూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతదేహానికి నివాళులర్పించారు మంత్రి కేటీఆర్. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న బోడ జగన్ హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ పొందుతూ ఇవాళ ఉదయం చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హాస్పిటల్ కు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని సిరిసిల్లకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్
మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్ను సస్పెండ్ చేసిన హైకోర్ట్