జేపీ నడ్డా అంటే అబద్ధాల అడ్డా

జేపీ నడ్డా అంటే అబద్ధాల అడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు బండి సంజయ్ కు పెద్ద తేడా లేదన్నారు మంత్రి కేటీఆర్.  కేసీఆర్ పై నడ్డా చిల్లర కామెంట్స్ చేశారన్నారు. నడ్డా కేసీఆర్ పై చిల్లర కామెంట్స్ చేశారన్నారు.  జాతీయ స్థాయి నాయకుడు ఇంత నీచంగా మాట్లాడుతారని అనుకోలేదన్నారు. బీజేపీ అంటే బక్వాజ్ జుమ్లా పార్టీ అని అన్నారు. ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు  చేసిందేమి లేదన్నారు. హిందూ ముస్లీంల మధ్య చిచ్చుపెట్టి  ఓట్లు దండుకోవడమే తెలుసన్నారు.  బీజేపీలో బండైనా..గుండైనా ఎవరైనా ఒకటేనన్నారు. జేపీ నడ్డా అంటే అబద్ధాల నడ్డా అని అన్నారు.నడ్డా ప్రజాస్వామ్యంపై  మాట్లాడటం దెయ్యాలు వేదాలు చెప్పినట్లుగా ఉందన్నారు. చీకట్లో గాడ్సే గొప్పోడంటారు..బయటకొచ్చి గాంధీకి నివాళులర్పిస్తారా అని అన్నారు. రోడ్డుపై అరగంట నిలబెట్టిన పరిస్థితి ఏ ప్రధానికి రాలేదన్నారు కేటీఆర్.కేంద్రప్రభుత్వ కిసాన్ సమ్మాన్ కు స్ఫూర్తి రైతు బంధు కాదా అని ప్రశ్నించారు. తాము3 వేల కోట్ల ప్రజా ధనంతో విగ్రహాలు పెట్టలేదన్నారు. మేకిన్ ఇండియా అని చెప్పి మేకిన్ చైనా విగ్రహాలు పెట్టారన్నారు.