సంక్షేమ పథకాల అమలులో మేమే గ్రేట్

సంక్షేమ పథకాల అమలులో మేమే గ్రేట్

అచ్చంపేట: సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అచ్చంపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్ అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కరెంట్ కోతలు కోతలు లేకుండా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లను అందించిన ఘనత కే సీఆర్ దేనని పేర్కొన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అమ్మాయిల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్షా పదహారు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల. ఆడ పిల్లల పెళ్లిళ్లు చేశామని పేర్కొన్నారు.