
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారాలోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందకపోతే మన మిత్ర ద్వారా తెలియజేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడమే... కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. 80 శాతం మంది పిల్లలకు స్కూల్ కిట్ అందించామని.. సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం ( జూన్ 16) నాటికి ఉపాద్యాయుల బదిలీల ప్రక్రయను పూర్తి చేస్తామన్నారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఏడాదిలో చూపిస్తామన్న ఆయన... గత ప్రభుత్వంలో విద్యాశాఖను నాశనం చేశారని.. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఏం చేశారో తనకు తెలియదన్నారు.