ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్

ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్​ లో తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారాలోకేష్​ మీడియా సమావేశం నిర్వహించారు.   ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు.  తల్లికి వందనం అందకపోతే మన మిత్ర ద్వారా తెలియజేయాలని సూచించారు. 

 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడమే... కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్​ అన్నారు. 80 శాతం మంది పిల్లలకు స్కూల్​ కిట్​ అందించామని.. సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం  ( జూన్​ 16) నాటికి ఉపాద్యాయుల బదిలీల ప్రక్రయను పూర్తి చేస్తామన్నారు.

 ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఏడాదిలో చూపిస్తామన్న ఆయన... గత ప్రభుత్వంలో విద్యాశాఖను నాశనం చేశారని.. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఏం చేశారో తనకు తెలియదన్నారు.